Wednesday 30 July 2014

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..


అదును దాటినా వరుణుడి కరుణ లేక అన్నదాతలు ఎదురుచూపులు ఫలించాయి. నాలుగు రోజులుగా ఎ
డతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వ్యవసాయపనుల్లో రైతులు తలమునకలయ్యారు. ఐతే..నగరాల్లో మాత్రం జనజీవనం స్తంభించింది. కాసులకు కక్కుర్తిపడి అధికారుల వేసిన నగర రోడ్లు అసలు రూపం బయటపడింది. రాజధాని కాబోయే విజయవాడ నగరం రహదారులు అధ్వానంగా మారాయి. అడుగుకో గొయ్యి..గజానికో తటాకం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దుర్గగుడి వద్ధ హైవే కూడా గతుకులమయంగా మారింది. నిధులు లేవనో సాకుతో అధికారులు పట్టించుకోవడం లేదు. మరి సీఎం ప్రమాణ స్వీకారానికి, భవంతుల ఆధునికికరణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రజలే దేవుళ్ళు..సమాజమే దేవాలయం అని చెప్పిన పార్టీ ప్రజలకు చేసిన సేవ ఇదేనా...

No comments:

Post a Comment